బడ్జెట్పై చిదంబరం అసంతృప్తి

బడ్జెట్పై చిదంబరం అసంతృప్తి


న్యూఢిల్లీ: 2015 ఆర్ధిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పలు పార్టీలు పెదవి విరిచాయి. శనివారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్పై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు మేలు చేసే బడ్జెట్ ఇది.. సామాన్యులను పట్టించుకోలేదని విమర్శించారు.



ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినట్టే.. ప్రణాళిక వ్యయాన్ని కూడా తగ్గించేశారని ఆయన మండిపడ్డారు. ప్రజాప్రయోజన పథకాలను నిధులు తగ్గించడం అన్యాయమన్నారు. కార్పొరేట్లు ఒక్కటే అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందదని చెప్పారు. అందరూ బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చిదంబరం తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top