టీఎంసీ నేత ఇంట్లో పేలుడు..భార్య మృతి

టీఎంసీ నేత ఇంట్లో పేలుడు..భార్య మృతి - Sakshi


కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో తృణముల్ కాంగ్రెస్ నేత బురో హన్సడా బర్బహమ్ నివాసంలో ఆదివారం  పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో టీఎంసీ నేత బురో హన్సడా భార్య మృతిచెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యర్ధి పార్టీల వారు ఈ ఘటనకు పాల్పడ్డారా, లేక ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top