అంతగఢ్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు
రాయ్ పూర్ : ఛత్తీస్గఢ్లోని అంతగఢ్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీý సాధించింది. తన సమీప ప్రత్యర్థిపై బీజేపీ అభ్యర్థి భోజ్రాజ్ నాగ్ 51వేల మెజార్టీతో గెలుపొందారు. కాగా నక్సల్స్ ప్రభావిత ప్రాతం కావటంతో అంతగఢ్లో కౌంటింగ్ ఆలస్యంగా మొదలైంది. ఈనెల 13న అంతగఢ్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరిగింది.
ఇక దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో 33 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో భాజపా తనకున్న సీట్లలో సగానికిపైగా కోల్పోయింది. 12 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే.