'బీహార్లో మాదే విజయం'
న్యూఢిల్లీ: బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్లు పొత్తుపెట్టుకోవడం అనైతికమని జైట్లీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని జైట్లీ పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణం చేసిన అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు జైట్లీ శుభాకాంక్షలు తెలిపారు.