ఎంపీల బంధువులకు టికెట్లివ్వం: బీజేపీ
పాట్నా: బీహార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన అభ్యర్థుల తాలూకు ఎమ్మెల్యే స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల పోటీకి వారి కుమారులు, బంధువులకు సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని బీజేపీ స్పష్టం చేసింది. బీహార్లో మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాలకు ఆగస్టు 21న ఉప ఎన్నిక జరగనుంది. మరోపక్క, బీహార్లో ఉప ఎన్నికల బరిలోకి దిగేందుకు జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహా కూటమిగా ఏర్పడ్డాయి.