288 స్థానాలకు శివసేన పోటీ?

288 స్థానాలకు శివసేన పోటీ? - Sakshi

ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ, శివసేన పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్ధుబాటు వ్యవహారంలో శివసేన పార్టీ ఖచ్చితంగా ఉండటంతో ఇరుపార్టీల మధ్య పోటీ చేసే సీట్ల సంఖ్యపై ఓ అవగాహనకు రాలేకపోయారు. 

 

ఈ నేపథ్యంలో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం మాతోశ్రీలో సమావేశమైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోతే మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని శివసేన యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల పొత్తుపై ఓ అవగాహనకు వచ్చేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్, సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top