బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. దేశంలోని తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. అలాగే నేపాల్ భూకంపం, సహాయక చర్యలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.