మృతులకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సంతాపం


న్యూఢిల్లీ:  బీహార్లో  పరిస్థితిని  సమీక్షించి, నష్టాన్ని అంచనా వేసేందుకు, సహాయ, రక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు   కేంద్రమంత్రులు రాధామోహన్ సింగ్, జేపీ నద్దా,  అనంత్ కుమార్ను  నియమిస్తూ  ప్రధానమంత్రి  నరేంద్రమోదీ ఆదేశాలు జారీ చేశారు.  మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ప్రధాని  నిర్ణయాన్ని పార్టమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు  కార్యకర్తలకు  తెలియజేశారు. 


 


పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరైన ఈ సమావేశంలో  భారత్, నేపాల్లో  భూకంప మృతులకు  సంతాపం తెలియజేసినట్టు  వెంకయ్య  తెలిపారు. కాగా, మరో కేంద్రసహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ఇండో-నేపాల్ సరిహద్దులో సహాయ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.





 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top