అజాంఖాన్పై చర్యలు తీసుకోండి
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బస్సు నడిపిన ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధిమంత్రి అజాంఖాన్పై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. విద్యార్థులు, ప్రయాణీకులతో ఉన్న బస్సును వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బాధ్యత రహితంగా ఓ మంత్రి బస్సు ఎలా నడుపుతారని ప్రశ్నించింది. ఈ ఘటనపై సమాజ్ వాది ప్రభుత్వం స్పందించకపోవడం చేతగాని తనమేనని పేర్కొంది. ఇటీవల అజాంఖాన్ తన స్వగ్రామం రాంపూర్ నుంచి రాష్ట్ర రవాణాశాఖకు చెందిన బస్సును డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపగా అది వివాదమైంది. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ దీనిపై మౌనంగా ఉండటం 'ఏమి చేయలేని నిస్సహాయతను చూపిస్తుంది' అని బీజేపీ నేత పాఠక్ అన్నారు.