ప్రపంచ అతిపెద్ద పార్టీగా బీజేపీ
న్యూఢిల్లీ: పూర్తి మెజార్టీతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మరో ఘనత సాధించింది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. గత ఐదు నెలలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన బీజేపీకి 8.80 కోట్ల మంది సభ్యులున్నారు. ఇదివరకు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉన్న ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా రికార్డును బీజేపీ బ్రేక్ చేసింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి 8.60 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు.
ఆదివారం నాటికి బీజేపీ సభ్యత్వం 8.80 కోట్లకు చేరినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ సభ్యత్వం 10 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో బెంగళూరులో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దీనిపై ప్రకటన చేయనున్నారు.