ఒబామాకు ఈ మెయిల్ పంపబోయి పోలీసులకు చిక్కాడు!
గయా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపబోయి పోలీసులకు చిక్కిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఒబామా ఆదివారం భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. బోద్ గయాలోనెట్ సెంటర్ నడుపుతున్న సుధీర్ కుమార్ కు వద్దకు బీహార్ కు చెందిన ఓ వక్తి వచ్చి ఒబామాకు ఈ మెయిల్ పంపాలంటూ విజ్ఞప్తి చేశాడు.
అయితే అందులో విషయాన్ని గ్రహించిన సుధీర్ స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారమిచ్చాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని సిటీ పోలీస్ సూపరిండెంట్ రాకేశ్ కుమార్ ధృవీకరించారు. ' ఒబామాకు ఈ మెయిల్ పంపబోయిన వ్యక్తి ఇనామ్ రాజా(29)గా గుర్తించామన్నారు. రెండు పేజీల ఉర్దూ భాషలో ఆ లేఖ ఉందని.. 130 కోట్ల డాలర్లు జాతీయ సంక్షేమ నిధికి అవసరంటూ ఆ లేఖలో ఉందన్నారు.అయితే అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీస్ అధికారి తెలిపారు. దానికి సంబంధించి కొన్ని మెడికల్ రిపోర్ట్ లు కూడా అతని వద్ద లభించాయన్నారు.