సందడిలో చావు ఎదురై.. ఓ తండ్రి దురదృష్టం

సందడిలో చావు ఎదురై.. ఓ తండ్రి దురదృష్టం


జైపూర్‌: రాజస్థాన్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. తండ్రి శిక్షణ ఇస్తుండగా అది చూస్తున్న కూతురు ప్రమాదవశాత్తు మృత్యువాతపడింది. అది కూడా గుండెలు జారీపోయేలా ఆరంతస్తుల భవనం పై నుంచి కిందపడి. ఈ సంఘటనను ఆమెతోపాటు చదువుతున్న తోటి స్నేహితులు వీడియో తీశారు. అదితీ సంఘీ అనే విద్యార్థిని జైపూర్‌లోని ఇంటర్నేషనల్‌ కాలేజ్‌ ఫర్‌ గర్ల్స్‌(ఐసీజీ)లో చదువుతోంది. ఆమె తండ్రి సునీల్‌ సంఘీ పర్వతాలను అదిరోహించడంలో తర్ఫీదును ఇస్తుంటారు. ఇందులో భాగంగా పలుకాలేజీలకు వెళ్లి కొండ ప్రాంతాలను, ఎత్తయిన ప్రదేశాలను తాడు సహాయంతో, జిప్‌లైనింగ్‌ సహాయంతో ఎలా చేరుకోవాలో చెబుతుంటారు. ఇలా ఆయన శిక్షణ ఇచ్చేందుకు వెళ్లిన పలు ప్రాంతాలకు ఆయన కూతురు కూడా వెళుతుంటుంది.



అందులో భాగంగానే జైపూర్‌లోని తన కూతురు చదివే కాలేజీలోనే ఆరంతస్తుల భవనం నుంచి జిప్‌ లైనింగ్‌ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తుండగా పై అంతస్తులో చాలామంది విద్యార్థులు పోగై ఉన్నారు. కింద మరికొందరు ఉండి వీడియోలు తీస్తున్నారు. ఈ సమయంలోనే ఓ విద్యార్థిని జిప్‌ లైనింగ్‌ ద్వారా కిందికి దింపుతుండగా కోలాహలంతో సందడి చేసే క్రమంలో అంతస్తుపై ఉన్న అదితీ పట్టు తప్పి ప్రమాదవ శాత్తు ఆరంతస్తుల మీద నుంచి అనూహ్యంగా పడిపోయి ప్రాణాలుకోల్పోయింది. ఈ ఘటన కాలేజీ యాజమాన్యాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగా శిక్షణ ఇస్తున్న తన తండ్రిని తీవ్ర విషాదంలో నింపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top