58 స్థానాలకు పెరగనున్న ఏపీ ఎమ్మెల్సీలు


ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి స్థానాల సంఖ్య 50 నుంచి 58కి పెరగనుంది. సోమవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది విభజన సమస్యలో మరో ముందడుగని ఆయన పేర్కొన్నారు. ఈ సవరణ బిల్లు ప్రకారం గతంలో ఉన్న స్థానాల సంఖ్య పెరగనుంది. అయితే, దీనిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎంపీ వినోద్కుమార్ సభలో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలను సంప్రదించాకే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టాలన్నారు. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  









 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top