గుజరాత్లో భూకంపం
గాంధీనగర్: గుజరాత్ స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతగా నమోదైంది. జునాగఢ్, పోరు బందర్, కచ్ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయని జాతీయ భూకంపశాస్త్ర పరిశోధన విభాగం తెలిపింది. అయితే, ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో ఒకే ప్రాంతంలో ఒకే రోజున మూడు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. కుల్లు జిల్లాలో శనివారం ఉదయం 6.45 ప్రాంతంలో తొలుత స్వల్పంగా కంపించిన భూమి తొలిసారి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 గా నమోదు కాగా, రెండోసారి ఉదయం 7.05 గంటల ప్రాంతంలో 4.3గానూ, మూడోసారి 9.08 గంటల ప్రాంతంలో 4.2 గా నమోదు అయింది.