నేపాల్కు ఫోన్ చేస్తే లోకల్ ఛార్జీ మాత్రమే!
హైదరాబాద్: నేపాల్లో భారీ భూకంపం సంభవించిన నేపధ్యంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది. మూడు రోజుల పాటు నేపాల్కు చేసే కాల్స్కు లోకల్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ఎక్కువ మంది భారతీయులు నేపాల్లో చిక్కుకుపోయినందున బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.
వేల మంది భారతీయ యాత్రికులతోపాటు విద్యార్థులు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. వారిలో తెలుగు వారు వందల సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు.