త్వరలో బిహార్లో సంపూర్ణ మద్య నిషేధం
పట్నా: అయిదోసారి బిహార్ గద్దెనెక్కిన నితీశ్ కుమార్ ... ఎన్నికల తొలి హామీని అమలు చేయబోతున్నారు. బిహార్లో సంపూర్ణ మద్య నిషేధం కానుంది. ఈ నిషేధం వచ్చే ఏడాది (2016) ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు నితీశ్ కుమార్ గురువారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కాగా మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఆయన గత జూలైలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆయన మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దీంతో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా బీహార్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.