'ప్రచారాలకే మోదీ సర్కార్'
హైదరాబాద్: దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ కేవలం ప్రచారాలకేనంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ రాజీవ్ గౌడ ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మరచి ఏడాదిగా కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు.
దేశంలో ఆరోగ్యం, విద్య, మహిళా సంక్షేమ రంగాల్లో ప్రగతి కుంటుపడిందని ఎద్దేవా చేశారు. గ్రామీణాభివృద్ధిని పూర్తిగా విస్మరించటంతో వ్యవసాయ రంగం కుంటుపడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం పూర్తిగా పేరు మార్పిడి ప్రభుత్వం అని ఆయన విమర్శించారు.