కేజ్రీవాల్తో విందు.. ప్లేటు రూ. 20 వేలు
ముంబై: ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నిధుల సేకరణ కోసం 'విందు' బాటపట్టారు. కేజ్రీవాల్ ప్రముఖులకు విందు ఇచ్చి వారి నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు.
కేజ్రీవాల్ ముంబైలో వజ్రాల వ్యాపారులు, బ్యాంకర్లు ఇతర ప్రముఖులకు విందు ఇచ్చారు. విందులో పాల్గొన్నవారు ప్లేటు భోజనానికి 20 వేల రూపాయల చొప్పున చెల్లించారు. దీని ద్వారా మొత్తం 91 లక్షల రూపాయలు సేకరించారు. ఇందులో 36 లక్షల రూపాయల నగదు, 36 లక్షల రూపాయలకు చెక్లు, వాలంటీర్ల ద్వారా 21 లక్షల రూపాయల నగదు వసూలైంది. కేజ్రీవాల్ త్వరలో బెంగళూరులో విందు ఇవ్వనున్నారు. కాగా కేజ్రీవాల్ నిధుల సేకరణ విధానంపై విమర్శలు వస్తున్నాయి. తమది సామాన్యుల పార్టీగా చెప్పుకునే కేజ్రీవాల్ ప్లేటు భోజనానికి 20 వేల రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.