ప్లాన్ చేసి.. ప్రియుడి మర్మాంగం కోసివేత!

ప్లాన్ చేసి.. ప్రియుడి మర్మాంగం కోసివేత! - Sakshi


సాక్షి, తిరువనంతపురం : తనను మోసం చేశాడన్న కోపంతో ప్లాన్ ప్రకారం ఓ యువతి తన ప్రియుడి జననాంగాన్ని కోసిపారేసింది. ఈ ఘటన కేరళలోని మళప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. యువతిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. మళప్పురం జిల్లాకు చెందిన ఓ యువతి, ఇర్షాద్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. కొద్దికాలం వీరి రిలేషన్ బాగానే కొనసాగింది. అయితే కొన్నిరోజుల నుంచి ఇర్షాద్ తనను పట్టించుకోకపోవడంతో ప్రియురాలు అతడి కదలికలను గుర్తించింది.



ప్రియుడు తనను మోసం చేయడంతో పాటు వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకుంది. దీంతో తెలివిగా విషయాన్ని కనుక్కుని సమస్యను పరిష్కరించుకోవాలనుకుంది. ప్లాన్ ప్రకారం కుట్టిపురంలో ఓ లాడ్జికి ప్రియుడిని పిలిచింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరగా అతడు తిరస్కరించినట్లు సమాచారం. వేరే యువతిని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రియుడు చెప్పాడు. తెలివిగా ఇర్షాద్‌ను మాటల్లో పెట్టి వెంట తెచ్చుకున్న కత్తితో అతడి జననాంగాన్ని కోసిపారేసింది. బాధితుడి అరుపులతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇర్షాద్‌ కోజికోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోసం చేశాడన్న కోపంతో యువతి ఈ చర్యలకు పాల్పడ్డారని భావిస్తున్నారు.



గత జూలైలో వివాహేతర సంబంధాలను సహించని తమిళనాడు మహిళ తన భర్త మర్మాంగాన్ని కోసిపారేశారు. కేరళలోనూ ఓ యువతి తనపై లైంగిక దాడులు చేస్తున్న నిందితుడిపై తిరగబడి అతడి జననాంగాన్ని కోసిపారేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆపై వేధింపులు తాళలేక తాను ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పిన యువతి కోర్టులో మాట మార్చడం సంచలనమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top