శివరాత్రికొచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం

శివరాత్రికొచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం


హౌరా: శివరాత్రి ఉత్సవాలకు వచ్చి తప్పిపోయిన 15 ఏళ్ల  అమ్మాయిపై అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పశ్చిమ బెంగాల్ లోని  హౌరాలో  ఈ దారుణం  జరిగింది.  



శ్యాంపూర్ కు సమీపంలో నిర్మానుష ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను  గుర్తించిన  పోలీసులు వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి తరలించారు. దుండగులు ఆమెను  నిర్జన  ప్రాంతంలోకి బలవంతంగా తీసుకుపోయి ఈ దురాగతానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.  ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని , మిగతా వారికి గాలిస్తున్నామని  సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top