తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి 50 లక్షల సభ్యత్వం
సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 50 లక్షల మంది బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నారని ఇరు రాష్ట్రాల పదాధికారులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావ డానికి ఉద్దేశించిన మహా సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని అమిత్ షా బెంగళూరులోఆదివారం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శాఖల పదాధికారులతో ఈ సదర్భంగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పనితీరును వారు వివరించినట్లు సమాచారం. సమావేశంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పురందేశ్వరి, ఏపీ యువజన మోర్చా అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు