43 మంది మావోయిస్టుల లొంగుబాటు
రాయ్పూర్: చత్తీస్గఢ్లో ఐదుగురు మహిళలతో సహా 43 మంది మావోయిస్టులు, వారి మద్దతుదారులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టులకు పట్టున్న సుకుమా జిల్లాలో సీనియర్ పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయినట్టు ఏఎస్పీ సంతోష్ సింగ్ చెప్పారు.
లొంగిపోయిన మావోయిస్టులపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి చత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకం పట్ల వారు విశ్వాసం వ్యక్తం చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు. హింసను వ్యతిరేకిస్తూ, మావోయిస్టుల సిద్ధాంతాల పట్ల విముఖత వ్యక్తం చేశారని తెలిపారు.