ఇల్లు కూలి నలుగురి మృతి
ఉత్తరప్రదేశ్: ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
ఆ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నానిన ఇల్లు ఒక్కసారిగా కూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.