ఇల్లు కూలి నలుగురి మృతి


ఉత్తరప్రదేశ్‌: ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.



ఆ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నానిన ఇల్లు ఒక్కసారిగా కూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top