మూడేళ్ల పాపపై అత్యాచారం
సాక్షి, ముంబై: ఇక్కడి ఆజ్మీనగర్లో ఓ కామాంధుడు మూడేళ్ల పాపపై అత్యాచారానికి తెగించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ ఆసిఫ్ అన్సారీ అనే 20 ఏళ్ల యువకుడు తన పక్కింట్లో ఉండే పాపను ఆడుకోవటానికని తన ఇంటికి తీసుకొచ్చాడు.ఆ పాపపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో చిన్నారి గట్టిగా కేకలు వేసింది. ఇది విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి పాపను రక్షించి అన్సారీని పట్టుకున్నారని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.
మరిన్ని వార్తలు