కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్
- 33 మంది విద్యార్థులకు అస్వస్థత
మధ్యప్రదేశ్: అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక భరతి ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న కోల్డ్స్టోరేజ్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవడంతో.. 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రత్యేక అంబులెన్స్ల సాయంతో ఆస్పత్రికి తరలించారు.