2జీ కేసుకు కొత్త బాస్ ఆర్కే దత్తా
న్యూఢిల్లీ: 2జీ కేసుకు కొత్త బాసొచ్చారు! సీబీఐ అదనపు డెరైక్టర్ ఆర్కే దత్తా ఇకపై ఈ కేసును పర్యవేక్షించనున్నారు. సీబీఐ డెరైక్టర్ రంజిత్సిన్హాను 2జీ దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు తప్పించిన సంగతి తెలిసిందే. 1981 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన రూపక్ కుమార్ దత్తా.. ప్రస్తుతం సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
2జీ కేసులో దర్యాప్తు బృందానికి ఈయనే నేతృత్వం వహిస్తున్నారు. సీబీఐలో ర్యాంకుల వారీగా చూస్తే రంజిత్సిన్హా తర్వాత... స్పెషల్ డెరైక్టర్ అనిల్ సిన్హా రెండో స్థానంలో ఉన్నారు. అయితే 2జీ కేసును పర్యవేక్షిస్తున్న వారిలో రంజిత్సిన్హా తర్వాత సీనియర్ అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పజెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.