విశాఖలో 20వ అంతర్జాతీయ సీ ఫుడ్ షో
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ : సెప్టెంబర్ 23 నుం చి 25 వరకు విశాఖలో భారత 20వ అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన (సీ ఫుడ్ షో) నిర్వహిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. విశాఖపట్నం పోర్టు నుంచి 2015-16 ఏడాదిలో రూ.7,161 విలువైన సముద్రపు ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు పేర్కొంది.
ఈ మేరకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. విశాఖ పోర్ట్ నుంచి ఎగుమతులను పెంచడానికి ఇప్పటి వరకు ప్రత్యేకించి అధ్యయనం చేయలేదని చెప్పింది.