ఘోర రోడ్డు ప్రమాదం: 17 మంది మృతి


సిమ్లా : హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో గురువారం ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సింగ్లా నుంచి కల్ప వెళ్తుండగా ఆ బస్సు అదుపు తప్పి దాదాపు 400 అడుగుల లోతు గల లోయలో పడిపోయింది.


ఆ ఘటనలో డ్రైవర్తోపాటు క్లీనర్ కూడా మృతి చెందారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని ఉన్నతాధికారులు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top