హర్యానాలో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి


న్యూఢిల్లీ: హర్యానాలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. హిసార్ సమీపంలో కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద  రైలు ఓ వాహనాన్ని ఢీకొంది. వాహనంలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 12 మంది అక్కడికక్కడే మరణించారు.



ఈ దుర్ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పొగ మంచు కారణంగా వాహనం డ్రైవర్  రైలును గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top