బాలికపై అత్యాచారం.. హాస్టల్లోనే ప్రసవం

బాలికపై అత్యాచారం.. హాస్టల్లోనే ప్రసవం


రాయ్పూర్: ప్రభుత్వ రెసిడెన్సియల్ స్కూల్లో ఓ గిరిజన బాలిక ప్రసవించింది. పదోతరగతి చదువుతున్న ఆ విద్యార్థినిపై సమీప బంధువే అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. బిడ్డ జన్మించిన తర్వాత అతడే పసికందును చంపి పారేశాడు. చత్తీస్గఢ్లో కొరియా జిల్లా రాంపూర్ బ్లాక్ రెసిడెన్సియల్ స్కూల్లో ఈ దారుణం జరిగింది.



ఈ వార్త మీడియాలో రావడంతో కొరియా జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నిందితుడితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశారు.  సూపరింటెండెంట్, ఆమె భర్త పరారీలో ఉన్నారు. సూపరింటెండెంట్ బలవంతంగా బాలికకు హాస్టల్ క్యాంపస్లో ప్రసవం చేయించినట్టు పోలీసులు తెలిపారు. నది సమీపంలో పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనపై అత్యాచారం చేశాడని, హాస్టల్లోనే ప్రసవించినట్టు బాధితురాలు విచారణలో చెప్పింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top