తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం: 13 మంది మృతి


తమిళనాడు: మధురై సమీపంలోని కళ్లపట్టి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది  దుర్మరణం చెందగా, 19 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సిమెంట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 8 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top