ప్రేమ... పగ... ప్రతీకారం...

ప్రేమ... పగ... ప్రతీకారం...


 కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఒక పోలీసు అధికారి ఎలా పగ తీర్చుకున్నాడనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఎన్నై అరిందాల్’. అజిత్, త్రిష, అనుష్క నాయకా నాయికలుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ సూపర్‌హిట్‌ను ‘ఎంతవాడు గానీ...’ పేరుతో సీనియర్ నిర్మాత ఎ.ఎం రత్నం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి రత్నం మాట్లాడుతూ- ‘‘గౌతమ్ మీనన్ కొత్తశైలిలో తెరకెక్కిం చారు. అజిత్ నటన, అనుష్క త్రిషల గ్లామర్ ప్రధాన ఆకర్షణ. హారిస్ జయరాజ్ చాలా మంచి స్వరాలందించారు. తమిళంలో లాగానే తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top