నన్ను నో అన్నవాళ్లు చాలామంది!

నన్ను నో అన్నవాళ్లు చాలామంది!


‘‘విజయం విలువ ఎప్పుడు తెలుస్తుందో చెప్పనా? వరుసగా అపజయాలు ఎదుర్కొన్నప్పుడు. స్వీయానుభవంతో చెబుతున్న మాటలివి. పరాజయాల్లో ఉన్న తారలను ఎవరూ పట్టించుకోరు’’ అని కత్రినా కైఫ్ అంటున్నారు. ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర నుంచి బయటపడి ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’ అనే స్థాయికి చేరుకున్నారు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ‘ఫాంథమ్’, ‘జగ్గా జాసూస్’, ‘ఫితూర్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.



ఈ సందర్భంగా కత్రినా ఓసారి గతాన్ని గుర్తు చేసుకుంటూ - ‘‘ఒక వ్యక్తి ఎందుకు సక్సెస్ అవుతారో, ఎందుకు కారో ఎవరూ చెప్పలేం. కాకపోతే.. అపజయాలు మంచి పాఠాలవుతాయ్ కాబట్టి, తప్పులు చేయకుండా కాపాడతాయ్. అలాగే, వ్యక్తుల మనస్తత్వాలను కూడా బయటపెడతాయ్.



ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా నాతో నటించడానికి రెడీ అంటున్నారు. కానీ, ఒకప్పుడు ‘కత్రినాతో నటించాలా? మా వల్ల కాదు’ అని నన్ను నిరాకరించిన హీరోల జాబితా చాలానే ఉంది. అందుకే అంటున్నా.. కెరీర్ ఆరంభంలో ఎవరైతే మనల్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్లని జీవితాంతం గుర్తుంచుకోవాలని. ఇంకో విషయం ఏంటంటే.. చేదు అనుభవాలను మనసు వరకూ తీసుకెళ్లకూడదు. అప్పుడే అన్నింటినీ అధిగమించి పైకి రాగలుగుతాం’’ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top