'వర్మతో సరళా ఆంటీ'

'వర్మతో సరళా ఆంటీ' - Sakshi


దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. తన సినిమాల ప్రచారం విషయంలో విభిన్న పంథాలో ముందుకుపోయే రాము తన స్టయిల్ కొనసాగిస్తున్నాడు. ఈసారి వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన తదుపరి చిత్రానికి తన పేరే పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆర్జీవీ తెలుగులో తెర తెరకెక్కించబోయే తదుపరి సినిమాకు 'వర్మతో సరళా ఆంటీ' అనే టైటిల్ పెట్టాడని టాలీవుడ్ టాక్.



తన పేరును సినిమాలో టైటిల్ లో చేర్చడం వర్మకిదే మొదటిసారి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నాడట. పాపులర్ నటి 'సరళ ఆంటీ' పాత్ర పోషించనుందని చిత్రసీమ సమాచారం. సినిమా మొదలు కాకుండానే టైటిల్ తోనే ఆసక్తి రేపిన రాంగోపాల్ వర్మ తర్వాత ఇంకెన్ని సంచనాలు రేకిస్తారో చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top