'ఓం నమో వెంకటేశాయ' పేరు మార్చాలి
-దర్శకేంద్రుడి దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్: అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ సినిమాపై వివాదం నెలకొంది. ’ఓం నమో వెంకటేశాయ’ పేరును మార్చాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం నాయకులు రాఘవేంద్రరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం గిరిజన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గిరిజన జాతికి చెందిన హాథిరామ్ బాలాజీ కథను తెరకెక్కిస్తున్న రాఘవేంద్రరావు ఓం నమో వెంకటేశాయ అని పేరు పెట్టడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేరు మార్చి హాథిరామ్ బాలాజీ అని పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా హథీరాంబాబా జీవిత నేపధ్యంతో రూపొందిన ఓం నమో వెంకటేశాయ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 10 న విడుదల కాబోతోంది.