ఆయన అడిగితే అతిథి పాత్రకైనా రెడీ!

ఆయన అడిగితే అతిథి పాత్రకైనా రెడీ! - Sakshi


  ‘‘నా జీవితంలో అజయ్ దేవగన్ చాలా స్పెషల్. ఎందుకంటే  నేను, అజయ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అతనితో నాకెంతో సాన్నిహిత్యం ఉంది’’ అని కథానాయిక టబు అంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘విజయ్‌పథ్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని టబు అన్నారు. కానీ, ఆ తర్వాత అజయ్, టబు కలిసి సినిమా చేయలేదు. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు అజయ్ దేవగన్‌తో కలిసి మలయాళ ‘దృశ్యం’ రీమేక్‌లో నటించారు టబు. దీని గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘మా కజిన్, అజయ్, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. నేను అజయ్‌ను ‘వీడీ’ అని పిలుస్తా. అజయ్ అడిగితే అతిథి పాత్ర చేయడానికి కూడా నేను రెడీ’’ అన్నారు. ఈ పద్ధెనిమిదేళ్లల్లో తామిద్దరం కలిసి నటించకపోవడం ఆశ్యర్యంగా ఉందని టబు చెబుతూ - ‘‘సినిమాలు మేమిద్దరం కలిసి నటించకపోయినా అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. పార్టీల్లో అయితే మా ఇద్దరి అల్లరికి అంతే ఉండదు. సరదాగా ఆటపట్టించుకుంటూ ఉంటాం’’ అన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top