సెలీనా జైట్లీ నన్ను పొమ్మనలేదు!

సెలీనా జైట్లీ నన్ను పొమ్మనలేదు! - Sakshi


ముంబై: బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తనను ఇంటి నుంచి వెళ్లపొమ్మనలేదని మరోనటి సన్నీ లియోన్ తాజాగా స్పష్టం చేసింది.  గతంలో సెలీనాతో  విభేదాలు చోటు చేసుకున్న కారణంతోనే ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చిందన్న వార్తలను సన్నీ ఖండించింది.  ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ఆ ఇంటితో లీజు ఒప్పందం ముగియడంతోనే ఆ ఇంటిని వదిలి వేరే ఫ్లాట్ కు వెళ్లినట్లు సన్నీ పేర్కొంది. 'నేను సెలీనా ఇళ్లు ఖాళీ చేసి సంవత్సరం పైనే అయ్యింది.  ఒక సంవత్సరం నుంచి జాహూ ఫ్లాట్ లో ఉంటున్నా. అది చాలా బాగుంటుంది. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు.  నా లీజు ఒప్పందం ముగియడంతోనే సెలీనా ఇళ్లు ఖాళీ చేశా' అని సన్నీ తెలిపింది.


 


ఇదిలా ఉండగా వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకునే సన్నీ ఇళ్లు ఖాళీ చేసిందని అప్పట్లో రూమర్లు  చక్కర్లు కొట్టాయి. ఆ క్రమంలోనే సన్నీ మరో ఇంటిని వెతుక్కొవడానికి చాలా ఇబ్బందులు పడిందని.. కొంత కాలం హోటళ్లనే తన ఆవాసంగా మార్చుకుని బాలీవుడ్ సినిమా ఛాన్స్ ల కోసం తిరిగిందని వార్తలు కూడా వ్యాపించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top