సన్నీలియోన్‌పై మరో కేసు నమోదు!

సన్నీలియోన్‌పై మరో కేసు నమోదు! - Sakshi


కొత్త సినిమా విడుదల అవుతోందని సంబరంగా ఉన్న సన్నీ లియోన్.. ఇప్పుడు కష్టాల్లో పడింది. ఆమెతోపాటు సినిమాలో నటించిన తుషార్ కపూర్, వీర్ దాస్ తదితరులపై ఓ కేసు నమోదైంది. మిలాప్ జవేరీ తీసిన 'మస్తీజాదే' సినిమాలో నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బంది మీద కూడా ఈ కేసు దాఖలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. మస్తీజాదే సినిమాలో ఓ ఆలయంలో చాలా అసభ్యకరమైన రీతిలో కండోమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఓ సన్నివేశం ఉంటుంది.



ఆ సన్నివేశంతో సెంటిమెంట్లను దెబ్బతీశారంటూ ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు లెక్కలేనన్ని కత్తెరలు వేస్తే తప్ప విడుదలకు ఆమోదం తెలపలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్తగా కేసు కూడా నమోదు కావడంతో ఇక ఏం చేస్తారో చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top