సులోచన అండ్ వండర్ఫుల్ మదర్స్!
‘తుమ్హారీ సులు’... విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సినిమా ఇది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం ‘లగే రహో మున్నాభాయ్’ (తెలుగులో ‘శంకర్దాదా జిందాబాద్’గా రీమేక్ చేశారు)లో రేడియో జాకీ (ఆర్జే)గా నటించిన విద్యా... మళ్లీ ఈ సినిమాలో ఆర్జేగా సులోచన పాత్రలో నటిస్తుండడం స్పెషల్. ఇంకో స్పెషల్ ఏంటంటే... శుక్రవారం పూజా కార్యక్రమాలతో ‘తుమ్హారీ సులు’ ప్రారంభమైంది.
ఈ పూజకు విద్యా తల్లి సరస్వతీ బాలన్తో పాటు చిత్ర నిర్మాతలు అతుల్, తనూజ్ గర్గ్, శాంతి శివరామ్, దర్శకుడు సురేశ్ త్రివేణిల మాతృమూర్తులు హాజరై చిత్రబృందాన్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారితో విద్యా ఫొటో దిగారు. ‘‘వండర్ఫుల్ మదర్స్ బ్లెస్సింగ్స్తో ‘తుమ్హారీ సులు’ ప్రారంభమైంది.మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదాలు కూడా ఉంటాయని ఆశిస్తున్నా’’ అని విద్యా పేర్కొన్నారు. పాటతో ఈ రోజు ముంబైలోని వోర్లీలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. జూన్ నెలాఖరుకి సినిమాని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు.