మహేశ్‌కి తల్లిగా...!

మహేశ్‌కి తల్లిగా...!


 ‘పెద్దరికం’ కథానాయిక సుకన్య గుర్తుండే ఉంటారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు కారెక్టర్‌గా నటిగా చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ‘అధినాయకుడు’లో కూడా ఓ కీలక పాత్ర చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబు తల్లిగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ముందు ‘లగాన్’ ఫేం గ్రేసీ సింగ్‌ను ఈ పాత్రకు తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. ఫైనల్‌గా సుకన్యను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో ఆమె జగపతిబాబుకి భార్యగా నటిస్తున్నారు. ‘పెద్దరికం’లో అలరించిన ఈ జంట దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టిన చిత్రం ఇది. ఇందులో మహేశ్ సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top