ఆ నలుగురికీ కీలకం

ఆ నలుగురికీ కీలకం


ఊహులు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా జ్యో అచ్యుతానంద. మొదటి సినిమా తరహా లోనే ఈ సినిమాను కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందించాడు అవసరాల శ్రీనివాస్. ట్రయాంగులర్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు నలుగురి కెరీర్కు కీలకంగా మారింది.



ముఖ్యంగా అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతున్నారు. అందుకే జ్యో అచ్యుతానంద సక్సెస్ ఆయనకు కీలకం కానుంది. ఇక హీరోలుగా నటిస్తున్న నారా రోహిత్, నాగశౌర్యలకు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు సక్సెస్కు మాత్రం చాలాకాలంగా దూరంగా ఉన్నారు. ఇక హీరోయిన్గా నటిస్తున్న రెజీనా కూడా స్టార్ ఇమేజ్ కోసం ఈ సినిమానే నమ్ముకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top