మళ్లీ జంటగా..?

మళ్లీ జంటగా..?


 ‘షాహిద్ కపూర్, కరీనా కపూర్‌ల నిజజీవిత ప్రేమకథ అందరికీ తెలిసిందే. విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించడం మానేశారు. ఇక.. ఎప్పటికీ ఈ జోడీ కలిసి నటించరని చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ‘ఉడ్తా పంజాబ్’ అనే చిత్రంలో వారు నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది.  ‘కరీనాతో కలిసి నటిస్తున్నారటగా’ అని షాహిద్‌ను అడిగితే, ‘‘తనతో నటించనని ఎప్పుడైనా చెప్పానా? ఈ చిత్రంలో నేను ఉన్నాను. మిగతా విషయాలను దర్శక, నిర్మాతలు చెబుతారు’’ అన్నారు. మరి, ఇంతకీ షాహిద్ పక్కన కరీనా ఉన్నట్టా? లేనట్టా? అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top