సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకటి ఏర్పాటైంది. పలువురు నిర్మాతలు, దర్శకుల సహకారంతో ఈ ఛాంబర్ను ఏర్పాటుచేశామని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఛాంబర్ను శనివారం ఏర్పాటుచేశారు.



సినిమా పరిశ్రమలో వివాదాలు సహజమేనని ఈ సందర్భంగా దిలీప్ రాజా అన్నారు. విజయవాడలో సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, గుంటూరు - విజయవాడ మధ్య సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆయన తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top