శ్రీవారి సేవలో సమంత
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రముఖ హీరోయిన్ సమంత శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో స్వల్పంగా తోపులాట జరిగింది.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్లాల్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి సతీష్చంద్రలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో వీరు పాల్గొన్నారు.