మరపురాని సినిమా

మరపురాని సినిమా


రాజా, గెహనా వశిష్ట జంటగా పానుగంటి శశిధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నమస్తే’. మాస్టర్ వరుణ్ జీ సమర్పణలో రామ్‌కిషన్ జీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘మంచి సందేశంతో కూడిన చిత్రం ఇది. ప్రేమ, సెంటిమెంట్, వినోదం, ఉద్వేగం.. ఇలా అన్నీ సమపాళ్లల్లో ఉన్నాయి’’ అన్నారు. రాజా మాట్లాడుతూ - ‘‘నా కెరీర్‌లో మరచిపోలేని చిత్రం ఇది. మంచి కథాంశంతో రూపొందించాం. నాది చాలా మంచి పాత్ర. ఈ చిత్రం కోసం ముంబయ్‌లో చేయించిన గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top