రామప్పలో... రుద్రమదేవి

రామప్పలో... రుద్రమదేవి


వరంగల్:


రామప్ప దేవాలయంలో శనివారం ఉదయం నుంచి రుద్రమదేవి చిత్ర కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అనుష్క, రానా, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, జయప్రకాశ్ రెడ్డిలతో పాటు అల్లు అర్జున్, నిత్యామీనన్‌లు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


'ఒక్కడు'లాంటి బ్లాక్ బస్టర్ చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ అంతటి స్థాయి ఘనవిజయాన్ని సొంతం చేసుకోలేదు. టాలీవుడ్‌లో క్రియేటివ్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రంతో మళ్లీ పూర్వ వైభం కోసం ప్రయత్నిస్తున్నాడు. దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా గుణశేఖర్ ఈ సినిమాకు వ్యవహరించడం విశేషం. దాదాపు రూ.85 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top