ఈ ఫొటోలోని ప్రఖ్యాత నటి ఎవరో తెలుసా?

ఈ ఫొటోలోని ప్రఖ్యాత నటి ఎవరో తెలుసా?


ఈ ఫొటో చూశారా..! దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇది. తల్లిదండ్రులతో కలసి ముద్దుగా, బొద్దుగా కనిపిస్తున్న ఈ పాప ప్రఖ్యాత నటి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత దేశంలో అగ్రశ్రేణి హీరోయిన్‌గా ఎదిగింది. కోట్లాదిమంది యువకుల కలల, అందాల రాణిగా చెరగని ముద్ర వేసింది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలిగింది. తెలుగులో రెండు తరాల హీరోలతో, తండ్రీ కొడుకుల సరసన కూడా నటించింది. అగ్రశ్రేణి హీరోయిన్‌గా ఉన్నప్పుడే బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకుని ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఆమె కూతురితో తెరంగ్రేటం చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు హీరోల వారసులు కూడా ఈ ప్రఖ్యాత నటి కూతురితో నటించనున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ హింట్స్ చదివాక ఈ ఫొటోలో ఉన్న పాప ఎవరో అర్థమైఉంటుంది..! ఈ అతిలోక సుందరి పేరు శ్రీదేవి. రాంగోపాల్ వర్మ ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.



1963, ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించింది. ఆమె నాలుగేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లో తొలి లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక.. 2012లో మళ్లీ వెండితెరపై కనిపించింది. శ్రీదేవి తాజాగా 'మామ్' సినిమాలో నటించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top