కోలీవుడ్‌కు రాశీఖన్నా

కోలీవుడ్‌కు రాశీఖన్నా


 ఉత్తరాది బ్యూటీ రాశీఖన్నా టాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. తొలుత హిందీ చిత్రం మెడ్రాస్ కపే ద్వారా నటిగా పరిచయమైన ఈ సుందరి ఆ తరువాత టాలీవుడ్‌పై దృష్టి సారించారు. అక్కడ జిల్, శివం, బెంగాల్ టైగర్, సుప్రీమ్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అందాలారబోతకు ఏమాత్రం సందేహించని రాశీఖన్నాకు అక్కడ మార్కెట్ బాగానే ఉంది. తాజాగా కోలీవుడ్‌పై కన్నేశారు.



చాలా కాలంగా తమిళ చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్న ఈ అమ్మడికిప్పుడు అవకాశం వచ్చింది. సైతాన్ కా బచ్చా అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. సిద్ధార్ధ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కప్పల్ చిత్రం ఫేమ్ కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీకృష్ణ, కరుణాకరన్, తంబిరామయ్య, యోగిబాబు   ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది.



 సైతాన్ కా బచ్చా యాక్షన్‌తో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా రూపొందుతోందట.తమిళంలో చాలా అవకాశాలు వస్తున్నా ఈ చిత్ర కథ నచ్చడంతో వెంటనే నటించడానికి అంగీకరించినట్లు నటి రాశీఖన్నా అంటున్నారు. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం కావడం సంతోషంగా ఉందని కూడా పేర్కొన్నారు. చూద్దాం తన రాశి ఇక్కడ ఎలా ఉంటుందో. కోలీవుడ్‌లో క్లిక్ అయితే ఇక రాశీఖన్నా లక్కే వేరు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top