నెలరోజుల్లో క్లారిటీ ఇస్తా: రామ్చరణ్‌

నెలరోజుల్లో క్లారిటీ ఇస్తా: రామ్చరణ్‌ - Sakshi


హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాపై త్వరలో ప్రకటన వెలువడనుందని ఆయన తనయుడు, హీరో రామ్చరణ్ తెలిపారు. తన తండ్రి నటించనున్న సినిమాపై నెల రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. బ్లడ్ బ్యాంక్‌ లో చిరంజీవి జన్మదిన వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి రామ్చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన తండ్రి 150 సినిమాపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. ఈ సినిమాకు రామ్చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కాగా చిరంజీవి దంపతులు పూజలు కోసం నేపాల్‌ వెళ్లారు.



తన 150వ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారని తనకూ తెలుసునని గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దృష్టి అంతా 150వ సినిమా మీదేనని, అంతకుమించి ఆలోచించడం లేదని తెలిపారు. శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’, ‘అన్నయ్య’, ‘రౌడీ అల్లుడు’ తరహాలో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా చేయాలని ఉందని వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top