సాయి ధరమ్ ప్లేస్లో రాజ్ తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్స్తో హ్యాట్రిక్ సాధించాడు రాజ్ తరుణ్ . అయితే నాలుగో సినిమాగా వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఫ్లాప్ అయినా రాజ్ తరుణ్ జోరుకు మాత్రం బ్రేక్ పడలేదు. తాజాగా ఓ స్టార్ వారసుడు చేయాల్సిన సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో.
ఇప్పటికే సాయిధరమ్ తేజ్ హీరోగా మూడో సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, శతమానంభవతి పేరుతో మరో సినిమాను కూడా ప్లాన్ చేశాడు. అచ్చమైన తెలుగు కథతో తెరకెక్కనున్న ఈ సినిమా మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సక్సెస్ ఇస్తుందని భావించాడు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోగా సాయికి బదులుగా రాజ్ తరుణ్ను ఎంపిక చేశాడట.
ప్రముఖ రచయిత వేగ్నేష్ సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాలో ఓ కీలక పాత్రల్లో నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రారంభించి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.